అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోండి.. సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చంద్రబాబు లేఖ

by Vinod kumar |
అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోండి.. సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చంద్రబాబు లేఖ
X

దిశ, ఏపీబ్యూరో: కర్నూలు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​ శర్మకు లేఖ రాశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన రవ్వలకొండను వైసీపీ నేతలు అక్రమంగా తవ్వేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మైనింగ్‌ మాఫియా నుంచి రవ్వలకొండను కాపాడాలని రాష్ట్ర సీఎస్‌‌ను కోరారు. చరిత్ర కలిగి ప్రజలు పవిత్రంగా భావించే రవ్వలకొండను వైసీపీ మైనింగ్ మాఫియా నుంచి కాపాడాలని చంద్రబాబు లేఖలో వివరించారు.

Next Story