YSRTP విలీనం వార్తల వేళ ఆసక్తికర పరిణామం

by GSrikanth |   ( Updated:2023-06-22 12:44:16.0  )
YSRTP విలీనం వార్తల వేళ ఆసక్తికర పరిణామం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ షర్మిల.. కాంగ్రెస్‌తో బంధం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు ఆమె వైఖరియే నిదర్శనం అనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె గురువారం సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు. పీపుల్స్ పాదయాత్రలో అనారోగ్యం బారిన పడిన భట్టిని షర్మిల ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారే ప్రచారం జోరుగా వినిపిస్తున్న వేళ షర్మిల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా విష్ చేసిన షర్మిల తాజాగా భట్టి విక్రమార్కను ఫోన్‌లో పరామర్శించడం ఆసక్తిగా మారింది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భట్టిని పరామర్శించిన రోజే షర్మిల కూడా సీఎల్పీ లీడర్‌ను పలకరించడం హాట్ టాపిక్‌గా మారింది..

Also Read..

ఉన్నట్లుండి దొరకు అమరుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది.. సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు

Advertisement

Next Story

Most Viewed