Special Trains :వీకెండ్ హాలిడేస్.. తెలుగు రాష్ట్రాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్

by Ramesh N |   ( Updated:2024-08-16 14:35:15.0  )
Special Trains :వీకెండ్ హాలిడేస్.. తెలుగు రాష్ట్రాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వాతంత్ర్య దినోత్సవం, వీకెండ్ హాలీడేస్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వీకెండ్ సెలవుల కారణంగా ప్రజలంతా ప్రయాణాలు చేస్తున్నారు. సొంత ఊరికి, టూర్‌లకు వెళ్తున్నారు. దీంతో బస్సు, రైళ్లలో ప్రజలు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎస్సీఆర్ తెలుగు రాష్ట్రాల మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. నర్సాపూర్-సికింద్రాబాద్, కాకినాడ పట్టణం-సికింద్రాబాద్, కాచిగూడ-తిరుపతి మధ్య మొత్తం ఎనిమిది రైళ్లను ఎస్సీఆర్ ఏర్పాటు చేసింది.

Advertisement

Next Story

Most Viewed