Loan waiver:అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం..ఆందోళన వద్దు:ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Jakkula Mamatha |
Loan waiver:అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం..ఆందోళన వద్దు:ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రుణమాఫీ కచ్చితంగా చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి మాఫీ కాలేదని, అలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశాం అన్నారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే..ఆ ఎక్కువ ఉన్నది రైతులు కట్టిన వెంటనే రూ.2లక్షలను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. రైతులు ఎవరూ అధైర్యపడవద్దు అని భరోసా ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియా వారియర్స్‌ రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు వ్యవసాయ శాఖ ద్వారా సమస్యను పరిష్కరిస్తారు. మాఫీ కానీ వారు సంబంధిత వ్యవసాయ అధికారులను కలిసి మీ సమస్యల పై అర్జీ పెట్టుకోండి అని ఉత్తమ్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed