- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘లక్ష్మీ కెనాల్కు ఇంకో 10 రోజులు నీటిని విడుదల చేయాలి’
దిశ, భీంగల్ : కోతకు చివరి దశలో ఉన్న లక్ష్మి కెనాల్ కింద ఉన్న పంటలను బ్రతికించుకోనేందుకు గాను ఎస్సారెస్పీ నుండి లక్ష్మి కెనాల్కు నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఎస్సారెస్పీ సీఈ, ఎస్ఈలతో ఇదే విషయమై మాట్లాడారు. చేతికి వచ్చిన పంటను కాపాడుకొనేందుకు రోజు వారీగా 400 క్యూసెక్కుల నీటిని 10 రోజుల పాటు ఇవ్వాలని అన్నారు. ఇంకా సూమరు 0.3 టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొర్రో అని మొత్తుకున్న వినకుండా ఎస్సారెస్పీ నుండి అలకేషన్ లేకున్నా వరద కాలువ ద్వారా 4 టీఎంసీ నీటిని విడిచారని, అలకేషన్ ఉన్న లక్ష్మి కాలువకు నీటిని ఇవ్వకుండా లక్ష్మి కెనాల్ కింద ఉన్న చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్ కింది రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా లక్ష్మి కెనాల్ కింది రైతులు ఆఖరి తడి మానే వరకు నీటి విడుదలను కొనసాగించాలని ప్రశాంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.