- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి తెలంగాణకు నీటి విడుదల
దిశ, బాల్కొండ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి శుక్రవారం ఉదయం దిగువ గోదావరిలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ డీఈ గణేష్ తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ ఏడు కూడా తాగునీటి అవసరాల కోసం బాబ్లీ దిగువనున్న ఎస్సారెస్పీలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. అదేవిధంగా జులై ఒకటవ తేదీన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు అక్టోబర్ 28 తేదీ వరకు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. బాబ్లీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 2.75 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 0.75 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. ఆందులో నుంచి దిగువకు 0.6 టీఎంసీలను విడుదల చేశారన్నారు. 0.6 టీఎంసీల నీరు దిగువ గోదావరిలోకి విడుదల కాగానే బాబ్లీ గేట్ల మూసివేత ప్రక్రియను ప్రారంభిస్తారమన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి హైదరాబాద్ ఈఈ వెంకటేశ్వర్లు, నాందేడ్ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ CR బాన్సద్, ఎస్సారెస్పీ డీఈలు గణేష్, ప్రశాంత్, ఏఈఈలు రవి, ప్రణీత్ పాల్గొన్నారు.