గ్రామాల సమస్యలను పరిష్కరిస్తా : పాలకుర్తి ఎమ్మెల్యే

by Aamani |
గ్రామాల సమస్యలను పరిష్కరిస్తా : పాలకుర్తి ఎమ్మెల్యే
X

దిశ, తొర్రూర్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి ప్రారంభించారు. తొర్రురు మండలం ఫతేపూర్ గ్రామంలో మండలంలో సంబంధిత మండల అధికారులతో గ్రామాన్ని సందర్శించి పలు సమస్యలు తెలుసుకుని అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరాదిశగా సాగాలని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అధికారులకు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ....ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. ప్రజల సమస్యలను సాధ్యమైన రీతిలో పరిష్కరం చెయ్యాలనే ఉద్దేశ్యంతో గ్రామాల్లో తిరుగుతూ వారి సమస్యలు విని పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, పార్టీ శ్రేణులు, యూత్ నాయకులు, మహిళ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.

Next Story

Most Viewed