Minister : అశాంతి పాలనకు చరమగీతం

by Kavitha |
Minister : అశాంతి పాలనకు చరమగీతం
X

దిశ, కాటారం: 9 ఏళ్లు గత ప్రభుత్వంలో అశాంతి వాతావరణం లో గడిపామని, ప్రజలు మార్పు కావాలని కోరడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం కాటారం మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గారెపల్లి లో నిర్మించిన నూతనంగా నిర్మించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖరె, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, సబ్ కలెక్టర్ మాయంక్ సింగ్ జేసీ విజయలక్ష్మి ల తో కలిసి ఆవిష్కరించారు. గతంలో ఈ ప్రాంతంలో అశాంతితో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలకు తెలుసునని మహాత్మా గాంధీ ఆశయాలతో ముందుకు నడవాలని మార్పు కావాలని ప్రజలు నన్ను గెలిపించారని శ్రీధర్ బాబు అన్నారు. మహాత్మా గాంధీ కి పూలదండలు వేసి నివాళులర్పించారు. కాటారం సొంత మండలంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆర్యవైశ్యులను మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు.

వైశ్యుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ఏ పని చేపట్టిన పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని అభివృద్ధిని ఆశించే ఆర్య వైశ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. అభివృద్ధి కోసం మీరు మేము కలిసినడుద్దామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలో ఆర్య వైశ్యుల కోసం, మండల వర్తక సంఘం కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కు నిధులు మంజూరు చేస్తానని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. మహిళల అభివృద్ధి కోసం కాటారం మండలం నుండి సుమారు 100 మంది మహిళలకు మంత్రి శ్రీధర్ బాబు సొంత ఖర్చులతో హైదరాబాద్ లో ఉపాధి లో పది రోజులు శిక్షణ ఇప్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. కాటారం లో సుమారు మూడు కోట్ల వ్యయంతో ఇండస్ట్రీ స్థాపించి మహిళలకు ఉపాధి కల్పిస్తామన్నారు. సుమారు నాలుగు కోట్ల వ్యయంతో కాటారంలో ఐటీఐ భవన నిర్మాణం చేపడుతున్నట్టు స్థల సేకరణ పూర్తయినట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పవిత్రం శ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షులు అని అంతుల శ్రీనివాస్, ఆవోపా రాష్ట్ర సహాయ కార్యదర్శి అనంతుల రమేష్ బాబు, జిల్లా మాజీ అధ్యక్షులు శిరుప అనిల్, ఐతు రమేష్, మండల అవోపా అధ్యక్షులు ఎంఎల్ఎన్ మూర్తి , నాయకులు అల్లాడి సదాశివ్, కముటాల రవీందర్, కమల మనోహర్, కలికోట శ్రీనివాస్, దారం నగేష్ కుమార్, అల్లాడి చంద్రమౌళి, తడకమట్ల రమేష్ బాబు, మద్ది నవీన్ కుమార్, బచ్చు ప్రకాష్, చిట్టూరి రవి, మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో అడ్డూరి రాజు, కాంగ్రెస్ నాయకులు కోట రాజాబాపు, ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సమ్మయ్య, ఉన్న వంశీ వర్ధన్ రావు, నవీన్ రావు, ఆంగోతు సుగుణ, జాడి మహేశ్వరి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాటారం డీఎస్పీ జి.రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Next Story

Most Viewed