Varla Ramaiah: సీబీఐ అధికారులపై కేసులు పెట్టిన ఘనత జగన్‌దే: వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు

by Shiva |
Varla Ramaiah: సీబీఐ అధికారులపై కేసులు పెట్టిన ఘనత జగన్‌దే: వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులపై కేసులు పెట్టిన ఘనత మాజీ సీఎం జగన్‌కే దక్కిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పరిపాలన అంతా కుట్రలు, కుతంత్రాలతో సాగిందిని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీని కుట్ర పూరితంగా ధ్వంసం చేసేందుకు పక్కాగా ప్లాన్ చేశారని.. ఇది ముమ్మాటికీ దేశ ద్రోహం కిందికే వస్తుందని అన్నారు. ఒకవేళ ఆ బోట్లు బ్యారేజీ గేట్లను మరింత బలంగా ఢీకొని ఉంటే దివిసీమ ఉప్పెన కంటే పెద్ద ప్రమాదం సంభవించి ఉండేదని ఫైర్ అయ్యారు. బ్యారేజ్ కింద ఉన్న గ్రామాలు తుడిచి పెట్టుకు పోయేవని అన్నారు. ఇక కోడికత్తి కేసులో ఒక దళిత యువకుడిని అన్యాయంగా ఐదేళ్లు జైల్లో పెట్టించిన ఘనడు జగన్ కాదా అని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో కూడా జగన్ గులకరాయి డ్రామా ఆడారని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed