నేడు తుంగతుర్తి కాంగ్రెస్ అసమ్మతివాదుల భేటీ ?

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-05 05:37:45.0  )
నేడు తుంగతుర్తి కాంగ్రెస్ అసమ్మతివాదుల భేటీ ?
X

దిశ, వెబ్ డెస్క్ :సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన వారికి, పాత అప్పటికే పార్టీలో కొనసాగుతున్న సీనియర్లకు మధ్య విభేధాలు రగలడంతో నియోజక వర్గం కాంగ్రెస్ పాత కొత్త కాంగ్రెస్ గా చీలి వర్గపోరు నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ వైఖరి నచ్చని పార్టీలోని అసమ్మతి వాదులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నేడు అర్వపల్లిలో డీసీసీ ఉపాధ్యక్షులు ధరూరి యోగానంద చార్యులు అధ్యక్షతన భేటీ అవుతున్నారు. దగాపడ్డ కాంగ్రెస్ నాయకుల్లారా కదలి రండి పేరుతో కీలక సమావేశ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అయితే ఈ సమావేశం జరుగకుండా పోలీసులతో ఒత్తిడి తెస్తున్నారని సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఎలాగు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని..మా రాజకీయం మేం చేస్తామన్నట్లుగా సీనియర్ లు, అసమ్మతివాదులు తమ భేటీకి సిద్దపడినట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed