ఘనంగా దేవీశరన్నవరాత్రి వేడుకలు.. ఢోలు వాయించిన ప్రధాని నరేంద్ర మోడీ

by karthikeya |   ( Updated:2024-10-05 07:47:01.0  )
ఘనంగా దేవీశరన్నవరాత్రి వేడుకలు.. ఢోలు వాయించిన ప్రధాని నరేంద్ర మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సావాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్రలోని పొహరదేవి ప్రాంతంలో ఉన్న జగదాంబ ఆలయాన్ని సందర్శించారు. అక్కడి మూలవిరాట్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయంలో ఏర్పాటు చేసిన ఢోలు మోగించారు. అనంతరం సంత్ మహారాజ్, రామ్‌రావ్ మహారాజ్ సమాధి అయిన స్థలాన్ని సందర్శించి నివాళులర్పించారు.

కాగా.. ఈ రోజు ఉదయం నాందేడ్‌లో ప్రధాని మోడీ ల్యాండ్ అయ్యారు. ఆయనకు మహారాష్ట్ర బీజేపీ లీడర్ అశోక్ చవాన్ స్వయంగా మోడీకి స్వాగతం పలికారు. అనంతరం నేరుగా పొహరదేవికి చేరుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో పర్యటించారు.

Advertisement

Next Story

Most Viewed