సైబర్ నేరగాళ్ల ఉచ్చు.. కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బులు మాయం

by Rajesh |
సైబర్ నేరగాళ్ల ఉచ్చు..  కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బులు మాయం
X

దిశ, నందిపేట్ : డొంకేశ్వర్ మండలం గంగాసముద్ర గ్రామంలో సైబర్ నేరగాళ్ల మోసానికి మరో అమాయకుడు మోసపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ముత్యం రెడ్డి మొబైల్‌కి ఓ లింకు రాగా దాన్ని క్లిక్ చేయడంతో రూ.4లక్షల16వేలు ఖాతా నుండి మాయం అయ్యాయని బాధితుడు వాపోయాడు. కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బుంతా పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక నందిపేట పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. బాధితుడు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఇలాంటి మోసాలకు మోసపోకుండా ఇలాంటి ఓటిపిలు వచ్చిన ఎవరికి చెప్పొద్దని స్థానిక ఎస్ఐ తెలిపారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కోరారు.



Next Story