నాగార్జునపై ఫైర్ అయిన తీన్మార్ మల్లన్న

by M.Rajitha |
నాగార్జునపై ఫైర్ అయిన తీన్మార్ మల్లన్న
X

దిశ, వెబ్ డెస్క్ : సినీనటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మీద ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ మీద విమర్శలు చేయబోయి.. మంత్రి కొండా సురేఖ(Konda Surekha) అక్కినేని కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు గత రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ.. కొండా సురేఖను తూర్పార పట్టారు. ఈ వ్యవహారంపై తీన్మార్ మల్లన్న అక్కినేని నాగార్జున మీద, సినీ ఇండస్ట్రీ మీద మండి పడ్డారు. కొండా సురేఖ మీద నాగార్జున పరువు నష్టం దావా వేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఒక బీసీ మహిళా మంత్రి కావడం వలనే.. సురేఖ మీద కక్ష్య గట్టినట్లు ఉందని, చూస్తాం ఎంతవరకు వెళతారో అని అన్నారు. అక్కినేని కుటుంబం మీద కొండా సురేఖ ఏదో మిస్ ఫైర్ అయి మాటలు వదిలేసి, ఆ తర్వాత క్షమాపణలు అడిగారని.. అయినప్పటికీ తనని ఇంకా తిడుతున్నారని, మరి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ను అక్రమంగా కట్టారని తేలినపుడు ఎందుకు మీరు నోరు మెదపలేదు అంటూ సినీ ఇండస్ట్రీ మీద మల్లన్న ఫైర్ అయ్యారు.

Next Story

Most Viewed