నల్లమల్ల అడవిలో మాయమైన ఆదివాసీ…గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

by Kalyani |
నల్లమల్ల అడవిలో మాయమైన ఆదివాసీ…గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఎర్ర పెంటకు చెందిన నిమ్మల శంకర్ అనే చెంచు యువకుడు గత మూడు రోజుల క్రితం అనగా బుధవారం అడవి ఉత్పత్తుల సేకరణకు వెళ్లి అడవిలో మాయమయ్యాడు. ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన వ్యక్తి ఎంతకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు లింగాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన యువకుడి కోసం అడవిలో కుటుంబ సభ్యులతో కలిసి లింగాల పోలీసులు, మన్ననూర్ అటవీ శాఖ బేస్ క్యాంప్ వాచర్లు కొంతమంది సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుడి ఆచూకీ ఎక్కడ లభ్యం కాకపోవడంతో ఏమైనా వన్య మృగాల బారిన పడ్డాడా, లేక ఇంకేమైనా జరిగి ఉంటుందా అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Next Story

Most Viewed