ప్రధాన కూడళ్లు సుందరంగా తీర్చిదిద్దాలి : ఆది శ్రీనివాస్

by Aamani |
ప్రధాన కూడళ్లు సుందరంగా తీర్చిదిద్దాలి : ఆది శ్రీనివాస్
X

దిశ,కథలాపూర్ : మండలంలోని రైతు వేదికలో ఆవరణలో శుక్రవారం రోజున కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేకంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన వివిధ మండలాల అధికారులతో గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యల పట్ల చర్చించారు.రానున్న బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.అలాగే గ్రామ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు ను గ్రామాల్లో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం గ్రామాల్లో ఎన్నికల జాప్యం కారణంగా సర్పంచులు, ఎంపీటీసీ లు లేనందున అక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అన్నారు.

గ్రామాల్లో ప్రతిరోజు శానిటైజేషన్ చేయాలనీ, పచ్చదనం ఉట్టిపడేలా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని అధికారులను కోరారు. అలాగే ప్రధాన కూడల్లో, వీదుల్లో లైట్లు నిరంతరాయంగా వెలిగేటట్లు చూడాలని కోరారు. అలాగే ప్రభుత్వ అధికారులు ప్రజలతో స్నేహభావంతో, సత్సంబంధాలతో మెలగాలని సర్టిఫికెట్ జారీలో తాత్సరం లేకుండా సహకరించాలని కోరారు.ఈ సమావేశం లో డీపీఓ.రఘువరన్,కథలాపూర్ ఎంపీడీఓ. శంకర్,తహసీల్దార్.వినోద్, ఏఓ యోగిత మేడిపల్లి ఎంపీడీఓ. పద్మావతి, తహసీల్దార్.వసంత, ఏ ఓ. ఎండి. హాసన్, భీమారం తహసీల్దార్ రవి కిరణ్,అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed