బాలా త్రిపుర సుందరి దేవిగా దుర్గామాత.. ఎమ్మెల్యే

by Sumithra |
బాలా త్రిపుర సుందరి దేవిగా దుర్గామాత.. ఎమ్మెల్యే
X

దిశ, నిజాంసాగర్ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో దుర్గా భవాని మండపం వద్ద శుక్రవారం అంగరంగ వైభవంగా దుర్గామాతను మండపంలో కొలువు తీర్చగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సంజీవరావు ప్రత్యేక పూజలు నిర్వహించగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దంపతులు తోట అర్చన, లక్ష్మీకాంత రావు పూజా కార్యక్రమాల్లో పాల్గొని దుర్గామాత ఆశీస్సులు జుక్కల్ నియోజకవర్గం ప్రజలను చల్లగా చూడాలని, పాడి పంటలు సంవృద్ధిగా పండాలని కోరారు.

తొమ్మిది రోజుల పాటు మండపంలో ప్రత్యేక పూజలు ప్రతిరోజు ఒక్కో అవతారంలో మాత దర్శనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రతాప్ రెడ్డి ఉమ్మడి మండలాల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఏలే.మల్లికార్జున్, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు లోక్య నాయక్, చికోటి మనోజ్ పటేల్, గుర్రపు శ్రీనివాస్, అబ్దుల్ కాలేక్, మల్లయ్య గారి ఆకాష్, గంగి రమేష్, అనీష్ పటేల్, గాండ్ల రమేష్, నాగభూషణం గౌడ్, తోట రాజు, గొట్టం నర్సింలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Next Story

Most Viewed