- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అత్యంత ఘోర ప్రమాదం.. నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి
దిశ, వర్థన్నపేట: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి వర్థన్నపేట పట్టణ శివారులోని ఆకేరు వాగు వంతెన వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వర్థన్నపేట ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం పగడాల ట్రావెల్స్ కు చెందిన ప్రయివేటు బస్సు వర్ధన్నపేట నుంచి వరంగల్ వైపు వెళుతోంది.ఇల్లందు నుంచి వర్ధన్నపేట వైపు ద్విచక్ర వాహనం పై నలుగురు యువకులు వస్తున్నారు.ఇల్లందు గ్రామ శివారులో ని ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది.దీంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా మరో యువకుడు హాస్పిటల్ తరలిస్తుండగా మార్గం మధ్యలో కన్నుమూశారు.
ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయారు.మృతులంతా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన మల్లె పాక సిద్ధు(18), పోన్నాల రనిల్ (19),కాశిమర్ల వరుణ్ తేజ్(18), మరోకరు వర్థన్నపేట కు చెందిన పోన్నం గణేష్ (18)లుగా పోలిసులు గుర్తించారు.వీరిలో గణేష్ ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణుడయ్యాడు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ హాస్పిటల్ లోని మార్చురీకి తరలించారు.వర్థన్నపేట ఏసిపి అంబటి సాంబయ్య,సిఐ సూర్య ప్రకాష్, ఎస్సై ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.