ఈటెల రాజేందర్​ను భారీ మెజారిటీతో గెలిపించాలి

by Disha Web Desk 15 |
ఈటెల రాజేందర్​ను భారీ మెజారిటీతో గెలిపించాలి
X

దిశ, కూకట్​పల్లి : మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్​కు మద్దతుగా అల్లాపూర్​ డివిజన్​లోని వివేకానందనగర్​ కాలనీలో బీజేపీ జిల్లా కార్యదర్శి పులిగోళ్ల శ్రీనివాస్​ యాదవ్​ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​ యాదవ్​ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరంగా తెలియపరుస్తూ

వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఈటెల రాజేందర్​ను భారీ మెజారిటీతో గెలిపించి మల్కాజిగిరి పార్లమెంట్ సీటును ప్రధానమంత్రి మోడీకి బహుమతిగా అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, బొంత హరికృష్ణ, అంకిత్ సింగ్, సుదర్శన్, ముదిరాజ్, మోహన్, జెల్ల రవి, రాజ్ కుమార్, సునీల్, జాదవ్, శ్రావణ్ కుమార్, కృష్ణంరాజు, వెంకటరెడ్డి, రవీందర్, పాలశ్యాం కుమార్, దామోదర్, భూషణం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed