నాకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

by GSrikanth |
నాకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త మండలాల ఏర్పాటు అధికార పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల గ్రూపు వార్ నడుస్తోంది. జోగు రామన్న వర్సెస్ రాథోడ్ బాపురావు మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. తనపై కుట్రలు చేస్తున్నారంటూ జోగు రామన్నపై రాథోడ్ బాపురావు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడంతో జోగు రామన్నపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనపై రామన్న కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని బాపురావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదని బాపురావు తేల్చి చెప్పారు. చివరి వరకు కేసీఆర్ వెంటే ప్రయాణిస్తానని తెలిపారు.

Read more: Rajaiah Vs Kadiam Srihari: కడియంపై మరోసారి MLA రాజయ్య సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed