- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఎన్డీఏ కూటమి ఆ స్ఫూర్తికి ఒక ఉదాహరణ.. మోడీ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: ప్రజల కష్టాలు నెరవేర్చడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డా అని ప్రధాని మోడీ అన్నారు. ఎన్డీయే ముఖ్యనేతలు, ఎంపీల సమావేశంలో శుక్రవారం ప్రధాని మోడీ మాట్లాడారు. విజయం సాధించి ఎన్డీయే సమావేశానికి వచ్చిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. మీరు నాకు బాధ్యతలు ఇచ్చారంటే మన మధ్యం బంధం చాలా బలంగా ఉందని అర్థం అని మోడీ తెలిపారు. ఎన్డీయే అధికారంలోకి రావడానికి కార్యకర్తలు శ్రమించారన్నారు. రాత్రింబవళ్లు శ్రమించిన లక్షలాది మంది కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్నారు. మీకు ఎంత కృతజ్ఞతలు తెలిపినా తక్కువే అన్నారు. విశ్వాసం అనే బంధం మనల్ని కలిపిందన్నారు. ఇవి తనకు భావోద్వేగ క్షణాలు అన్నారు. 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉండటం ప్రజాస్వామ్య గొప్పతనం అన్నారు. భారత దేశ స్ఫూర్తికి మన ఎన్డీఏ కూటమి ఒక ఉదాహరణ అన్నారు. ఆదివాసీలు గణనీయంగా ఉన్న పది రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉందన్నారు. అంతకుముందు మోడీ నాయకత్వాన్ని ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలు సభా ముఖంగా బలపర్చారు.