Sathupalli MLA : చేప పిల్లల పెంపకం లాభసాటిగా ఉండాలి

by Aamani |
Sathupalli MLA : చేప పిల్లల పెంపకం లాభసాటిగా ఉండాలి
X

దిశ,సత్తుపల్లి: చేప పిల్లల పెంపకంలో లాభసాటిగా ఉండాలని సత్తుపల్లి ఎమ్మెల్యే (Sathupalli MLA) మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సోమవారం పెనుబల్లి మండలం లో లంకాసాగర్ గ్రామం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ 100% రాయితీ పై 6 లక్షలు చేప పిల్లలు పంపిణీ చేశారు. అనంతరం (Sathupalli MLA) సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, మత్స్యకారుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని,మత్స్యకారుల సమస్యలు ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మంత్రి భట్టి ,తుమ్మల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి ఎమ్మార్వో, ఎంపీడీవో,కల్లూరు ఏఎంసి చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్లు, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజ బోయిన కోటేశ్వరరావు, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు నీలాల గోపి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed