Telangana Floods 2024: వరద బాధితులకు భాష్యం విద్యాసంస్థల విరాళం

by Ramesh Goud |
Telangana Floods 2024: వరద బాధితులకు భాష్యం విద్యాసంస్థల విరాళం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరద బాధితుల సహయార్ధం భాష్యం విద్యాసంస్ధలు ముందుకొచ్చాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళం చెక్కును అందజేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయి. వరదల వల్ల చాలా మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వరద బాధితులకు సహాయం చేసేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యాసంస్థల ప్రతినిధులు ముందుకువచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో రేవంత్ రెడ్డిని కలిసిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ.. విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ 4 కోట్ల భారీ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed