తిరుమల లడ్డూ వివాదంపై నాగబాబు పోస్ట్.. ఇలాంటి ద్రోహులను క్షమించకూడదంటూ ఫైర్

by Hamsa |
తిరుమల లడ్డూ వివాదంపై నాగబాబు పోస్ట్.. ఇలాంటి ద్రోహులను క్షమించకూడదంటూ ఫైర్
X

దిశ, సినిమా: తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగినట్లు పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనెతో కల్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు రియాక్ట్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, నాగబాబు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని జంతు కొవ్వుతో,చేప నూనెతో కల్తీ చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం. పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు. కానీ కోట్ల మంది హిందువుల గోడు కూడబెట్టుకున్నారని గుర్తించలేకపోయారు.

ఒక వ్యక్తి ఒక మతాన్ని స్వీకరించి ఆ దేవున్ని నిష్టతో పూజించి ప్రసాదం అర్పించడం జరుగుతుంది. తదుపరి ఆ ప్రసాదాన్ని తింటే ఆ దేవుడే వారితో మమేకమైనట్టు నమ్ముతారు. అంతటి విశిష్టతమైన ప్రసాదాన్ని అందులోనూ తిరుమల వంటి ప్రపంచ ప్రఖ్యాత గల పుణ్యక్షేత్రం లోని లడ్డూ ప్రసాదాన్ని నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో జంతు కొవ్వు సైతం వెయ్యడానికి వెనకాడని ఇలాంటి ద్రోహులను క్షమించకూడదు. అందుకే టీటీడీ లాంటి శాఖలలో హిందుత్వాన్ని ఆచరించే వారుంటేనే ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు పునరావృతం అవ్వవని నమ్ముతూ ఈ హేయమైన చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని అన్నారు.

Next Story