- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ వేదికగా జరిగిన ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (I4C) ప్రథమ వార్షికోత్సవం లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ దేవేందర్ సింగ్ సైబర్ నేరాల నియంత్రణలో ఉత్తమ పనితీరును కనబరిచినందుకు ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. సైబర్ నేరాల కట్టడికి జాతీయ స్థాయిలో 'సమన్వయ్' పేరుతో అనుసంధాన వ్యవస్థను రూపొందించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషించిన పాత్రకు కేంద్రం నుంచి ప్రశంసలు దక్కడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తు ప్రణాళికల్లోనూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ కీలక పాత్ర పోషించాలని సీఎం అభిలషించారు.
Advertisement
Next Story