తమిళనాడు CM స్టాలిన్ వీడియో షేర్ చేసిన కేటీఆర్.. ఎందుకో తెలుసా..?

by Rajesh |   ( Updated:2024-07-16 04:18:25.0  )
తమిళనాడు CM స్టాలిన్ వీడియో షేర్ చేసిన కేటీఆర్.. ఎందుకో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను నేడు ప్రారంభించారు. ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేర్ చేశారు. తెలంగాణలో ఈ అద్భుతమైన పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పథకాన్ని విద్యార్థుల కోసం ప్రారంభించామని.. కానీ అనుకోకుండా స్కీమ్ ఆగిపోయిందన్నారు. కాంగ్రెస్ సర్కారు తెలివితక్కువ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వెంటనే ఈ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story