పెద్దపల్లి ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ రియాక్ట్

by Prasad Jukanti |
పెద్దపల్లి  ఘటనపై  రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ రియాక్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో:పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్.. బాధ్యులపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఫోక్సో చట్టంతో పాటు కేసు విచారణ త్వరగా చేసి చార్జి షీట్ దాఖలు చేయాలని చెప్పారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలోని కాట్నపల్లిలోని ఓ రైస్ మిల్లులు కూలీగా పని చేస్తున్న ఓ మహిళ తన ఆరేళ్ల కూతురితో పాటు అక్కడే నిద్రిస్తుండగా అదే రైస్ మిల్లులో పని చేసే మధ్యప్రదేశ్ కు చెందిన బలరాం అనే యువకుడు పాపని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం గొంతునులిమి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన నుంచి ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed