Godavari river:గోదావరి నదిలో పడి వ్యక్తి దుర్మరణం

by Sridhar Babu |
Godavari river:గోదావరి నదిలో పడి వ్యక్తి  దుర్మరణం
X

దిశ,మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో గోదావరి నది (Godavari river)లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వెంకటేష్ (27) (Venkatesh)మేస్త్రి పనిచేస్తూ మొగిలిపేట గ్రామంలో నివసిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో గోదావరి నదికి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed