యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం ప్రత్యేక పూజలు

by Y. Venkata Narasimha Reddy |
యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం ప్రత్యేక పూజలు
X

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం (స్వాతి నక్షత్రం) పురస్కరించుకొని స్వామివారికి శత ఘటాభిషేకం, గిరి ప్రదక్షణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ధ సంఖ్యలో స్వాతి నక్షత్రం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వాతి నక్షత్రం పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. అటు యాదగిరి గుట్టపైన శివాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మూడవ రోజున అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా దర్శనమిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈవో భాస్కర్ రావు, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed