- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
'నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరవాలి'
దిశ, వెబ్డెస్క్: నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేటు ఎదుట శివసేన సేన పార్టీ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసులోటి గోపికిషన్ మాట్లాడుతూ.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. బోధన్కి కిరీటం లాంటిది నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలంగాణలో ఇంకా ఎంతో వైభవంగా ఫ్యాక్టరీ నడుపుకుంటాం అన్ని అనుకున్నామని కానీ తెలంగాణ ప్రభుత్వం బోధన్ నియోజకవర్గాన్ని తీవ్ర అన్యాయం చేసింది. వెంటనే ఫ్యాక్టరీ లే ఆఫ్ ఎత్తివేసి కార్మికులకి రైతులకి ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. చనిపోయిన కార్మికుల కుటుంబాలకి ప్రభుత్వమే ఆదుకొని 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వారి ఇంటిలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి.
గతంలో కూడా శివసేన పార్టీ ఆధ్వర్యంలో బోధన్ నుండి మెట్పల్లి వరకు కార్మికులకు రైతులకు మద్దతుగా పాదయాత్ర నిర్వహించడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఏనుగంటి గౌతమ్ గౌడ్, ఉపాధ్యక్షులు మధు బాబు, ప్రధాన కార్యదర్శి రవి కిరణ్, సీనియర్ నాయకులు పాండవుల భూమయ్య, ప్రితం గౌడ్, నర్సింలు, గోవింద్, శ్రీకాంత్, దూదేలా విజయ్, కుమార్, లోకేష్, కృష్ణ, రాజు, శ్రీను, నరేందర్, చిన్న, చింతకుల లోకేష్ గౌడ్, కాస్ప లింగం, అనిల్, సాయి, ప్రవీణ్, గణేష్, వివేక్, శివసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.