- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన ఆదేశాలు
X
దిశ, వెబ్డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రైతుబంధుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం పోచారం రైతు యాదగిరి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వెంచర్లపై ఇచ్చిన రైతుబంధు సొమ్ము రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధుగా తీసుకున్న రూ. 16 లక్షలు తిరిగి చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. గతంలో 33 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి యాదగిరిరెడ్డి అమ్మినట్లు ప్రభుత్వం గుర్తించింది. 33 ఎకరాల ప్లాట్ల భూమిపై యాదిగిరిరెడ్డికి రూ.16 లక్షల రైతుబంధు చెల్లింపు జరిగినట్లు తేల్చింది.
Advertisement
Next Story