‘ఒళ్లు దగ్గర పెట్టుకో’.. బాల్క సుమన్‌కు సతీష్ మాదిగ స్ట్రాంగ్ వార్నింగ్

by Satheesh |
‘ఒళ్లు దగ్గర పెట్టుకో’.. బాల్క సుమన్‌కు సతీష్ మాదిగ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: “పెద్ద రాష్ట్రం వస్తుంది. ఏడు చిన్న మండలాలు ఎందుకు” అని గతంలో కేసీఆర్ మాట్లాడారని కాంగ్రెస్ నేత సతీష్​ మాదిగ గుర్తు చేశారు. అవి పోతే పోనీ అని పేర్కొన్నాడని తెలిపారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లలో 7 ముంపు మండలాలపై మాట్లాడని బీఆర్ఎస్, ఇప్పుడు కొత్తగా రాజకీయం చేస్తుందని విమర్శించారు. రాజకీయ లబ్ధిని పొందేందుకు ఇలాంటి ట్రిక్స్ చేస్తుందన్నారు. ఏడు మండలాల అంశంపై కనీసం కేంద్రం వద్దకు కాంగ్రెస్‌ను పంపలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శించేందుకు కేసీఆర్ అండ్ టీమ్ ఎగిరిపడుతుందన్నారు.

ముఖ్యంగా బాల్క్ సుమన్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. పదేళ్ల నుంచి ఏం చేశారు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. ఆంధ్రలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగానే రేవంత్ రెడ్డి ఏపీ నేతలతో కలిసిపోయాడనే ప్రచారం మొదలు పెట్టారన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి సంపూర్ణంగా పరిష్కరిస్తారంటూ తెలిపారు. తెలంగాణను ఆంధ్రకు అప్పచెప్తారంటూ విమర్శించడం సరికాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య గందరగోళం సృష్టించడం సరికాదన్నారు

Advertisement

Next Story

Most Viewed