- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
J&K's Akhnoor: జమ్ముకశ్మీర్ లో ఆర్మీవాహనంపై కాల్పులు
దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్లోని అక్నూర్ సెక్టార్లో ఆర్మీవాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గంటల ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు. కాగా.. కాల్పుల్లో జవాన్లు ఎవరికీ గాయాలు కాలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా.. దాడి తర్వాత ఘటనాస్థలిని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. బటాల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దీపావళి పండుగ సందర్భంగా జమ్ముకశ్మీర్ లో భద్రతాచర్యలు చేపట్టిన సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
వారం వ్యవధిలో 12 మంది మృతి
ఇకపోతే, జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా వారం వ్యవధిలో ఇద్దరు జవాన్లు సహా 12 మంది చనిపోయారు. అక్టోబర్ 24న, బారాముల్లాలోని గుల్మార్గ్ సమీపంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై ముష్కరులు చేపట్టిన మెరుపుదాడిలోఇద్దరు సైనికులు, ఇద్దరు కార్మికులు జనిపోయారు. అదే రోజు త్రాల్ లో జరిగిన ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు గాయడ్డాడు. అక్టోబరు 20న గందర్బాల్ జిల్లా సోనామార్గ్లో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు చనిపోయారు.