- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
KTR : దసరాకే కాదు..దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా? : కేటీఆర్
X
దిశ, వెబ్ డెస్క్ : ధాన్యం కోనుగోలు(Purchase of Paddy)చేయకుండా రైతులను దసరాకే కాదు..దీపావళికి కూడా దివాళా తీయిస్తారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా..ధాన్యం కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే..ప్రభుత్వానికి రైతుల గోస పట్టదాయే అని మండిపడ్డారు. రాజకీయాలపై పెట్టిన దృష్టి...ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రైతులంటే ఎందుకంత అలుసు? అని నిలదీశారు.
మీ గారడీ హామీలను రైతులు విశ్వసించి మోసపోతున్నందుకా? అర్ధించడం తప్ప అక్రోషించడం తెలియని అమాయకులైనందుకా? అని విమర్శించారు. రాజకీయాల్లో రాక్షసక్రీడలను మానేసి..రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించండని..దయచేసి రైతుల విషయంలో రాజకీయాలు చేయకండని ప్రభుత్వాన్ని కోరారు.
Advertisement
Next Story