ప్రజాభవన్ లో 5 రూపాయల భోజనం చేసిన స్పోక్స్ పర్సన్ దయాకర్

by M.Rajitha |
ప్రజాభవన్ లో 5 రూపాయల భోజనం చేసిన స్పోక్స్ పర్సన్ దయాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాభవన్ కు తమ సమస్యల వినతి పత్రాలు ఇచ్చేందుకు, సమస్యల పరిష్కారం కోసం వచ్చే పేదలకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం రూ.5 మీల్స్ ను అందుబాటులో ఉంచింది. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పబ్లిక్ వస్తున్నందున, వారికి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో భోజన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో ప్రజాభవన్ ప్రాంగణంలో రూ.5 మీల్స్ ను ప్రోవైడ్ చేశారు. పార్టీ అదేశాల మేరకు ఆ స్టాల్ ను కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ దయాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా భవన్ లో 5 రూపాయల భోజనం అద్భుతంగా ఉన్నదన్నారు. ప్రజావాణికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మంగళ, శుక్రవారాల్లో జరిగే ప్రజావాణికి వచ్చిన వారిలో దాదాపు 600 మందికి పైనే రూ.5 భోజనం తింటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చడంతో ముందు వరుసలో ఉంటుందన్నారు.

Next Story