రేవంత్ మాస్టర్ స్కెచ్!.. ఆ ఇద్దరు కాదు.. అతడే టార్గెట్?

by Prasad Jukanti |
రేవంత్ మాస్టర్ స్కెచ్!.. ఆ ఇద్దరు కాదు.. అతడే టార్గెట్?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇప్పటికే వరుస ఓటములతో, ఎమ్మెల్యేల వలసలతో గందరగోళంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అంటే తాజా పరిణామాలు చూసే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా ఆయన తమ ప్రభుత్వాన్ని కూలగొడతామని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు రంకెలేస్తుంటే తాము చూస్తూ ఉండాలా? అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి చేరికలపై పై విధంగా స్పందించడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అనూహ్యంగా హరీశ్‌రావును టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో మరింత దుమారం రేపింది. కేసీఆర్‌ను, కేటీఆర్‌ను కాదని హరీశ్‌రావుపై విమర్శలు ఎక్కుపెట్టడం వెనక మతలబు ఏంటనే చర్చ మొదలైంది.

వ్యూహాత్మక ఎత్తుగడేనా?..

అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల మధ్య మొదలైన బీ-టీమ్ దుమారం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్‌కు నష్టం కలిగించాయని నిన్న ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారగా, ఈ ఆరోపణలను ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు కొట్టిపారేశారు. అసలు రేవంత్‌రెడ్డే మోడీతో కుమ్మక్కయ్యారని ఎటాక్ చేశారు. అయితే కేసీఆర్, కేటీఆర్ హరీశ్‌రావు ట్రాప్‌లో ఉన్నందునే భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని రేవంత్ ఆరోపించడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ మనుగడ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాకుండా హరీశ్‌రావు‌పై ఆధారపడి ఉందని వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారి తీస్తోంది.

కేసీఆర్, కేటీఆర్‌పై ఓ వర్గం గుర్రు?

ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోగా ఈ ప్రవాహాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే కేసీఆర్, కేటీఆర్‌పై పార్టీలో ఓ వర్గం గుర్రుగా ఉందనే చర్చ జరుగుతోంది. పార్టీని నమ్ముకున్నవారిని కాదని వలస నేతలనే ప్రోత్సహించారని మొన్నటికి మొన్న ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలోనూ ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నా వలస నేతకే టికెట్ ఇచ్చారనే విమర్శలు వినిపించాయి. ఓ వైపు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా.. అధిష్టానం తీరు మారడం లేదనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్‌లో కీలకమైన హరీశ్‌రావును రేవంత్‌రెడ్డి టార్గెట్ చేయడం ద్వారా భవిష్యత్తులో హరీశ్‌ను సైతం లాక్ చేసేందుకు ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా స్కెచ్ వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed