దేశ తలరాతను మార్చే శక్తి మహిళది

by Sridhar Babu |
దేశ తలరాతను మార్చే శక్తి మహిళది
X

దిశ,కేశంపేట : మహిళ లేనిదే భవిష్యత్తు లేదని, దేశ తలరాతను మార్చే శక్తి మహిళదని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం కేశంపేట మండల పరిధిలోని సంగెం గ్రామంలో డ్వాక్రా స్వయం సహాయక సంఘాల మహిళలకు పెరటి కోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ఇంటి వద్దే స్వయం ఉపాధి ద్వారా మహిళలకు ఆర్థిక ప్రయోజనం పొందేలా పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. బహిరంగ మార్కెట్‌లో ఫారం కోళ్ల కన్నా నాటు కోళ్లకు ఎక్కువ డిమాండ్‌తో పాటు అధిక ధర కూడా ఉండడంతో మహిళలకు ఈ పథకం ద్వారా ఇంటి నుంచే ప్రతి నెలా వేల రూపాయలు సంపాదించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

తొలుత ఆసక్తి కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేస్తున్నారని, స్వయం ఉపాధి రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదేళ్లలో రాష్ట్రం ఎంతో విధ్వంసానికి గురైందని, దానిని అందరం కలిసి సరిదిద్దుకుందామని అన్నారు. ఇకపై గ్రామాల్లో గ్రామ సంఘాల మధ్య కూర్చొని మీ నిర్ణయం మేరకే అసలైన లబ్ధిదారులకు ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి, నాయకులు గూడ వీరేశం, జగదీశ్వర్, శ్రీధర్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, గిరి యాదవ్, భాస్కర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, ఇబ్రహీం, ఎంపీడీఓ రవిచంద్ర కుమార్ రెడ్డి, ఎంపీఓ కిష్టయ్య, ఏపీఎం భగవంత్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed