స్వీట్ లో తెల్లపురుగులు.. షాప్ సీజ్ చేసిన అధికారులు

by Nagam Mallesh |
స్వీట్ లో తెల్లపురుగులు.. షాప్ సీజ్ చేసిన అధికారులు
X

దిశ, తాండూరు : తాండూరు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్వీట్ లో తెల్లపురుగులు రావడం కలకలం రేపింది. ఇందిరా చౌక్ సమీపంలో ఉన్న మిలాప్ జ్యూస్ సెంటర్లో తీపి ప్రియులకు ఇష్టమైన షాహతూత్ కా మీఠా తింటుండగా ఒక్కసారి తెల్ల పురుగులు కనిపించడంతో కస్టమర్లు షాక్అ యిపోయారు. దీంతో జ్యూస్ సెంటర్ నిర్వాహకునికి కస్టమర్లకు మధ్య మాటల యుద్ధం జరిగింది. కస్టమర్లు వెంటనే మీడియాకు సమాచారం అందించారు. మీడియా ప్రతినిధులు చేరుకునే లోపు మున్సిపల్ అధికారులు జ్యూస్ సెంటర్ ను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కూడా జ్యూస్ సెంటర్లో మురిగిపోయిన పండ్లు, కొన్ని రోజుల నుంచి నిల్వ ఉంచిన స్వీట్లు పానీయాలు గుర్తించారు. షాహతూత్ కా మీఠా ను కూడా కొన్ని రోజుల నుంచి నిల్వ ఉంచినట్లుగా తెలిసింది. షాహతూత్ కా మీఠాలో కూడా పురుగులను పరిశీలించిన మున్సిపల్ అధికారులు జ్యూస్ సెంటర్ నిర్వాహకని పై మండిపడి జ్యూస్ సెంటర్ ను సీజ్ చేశారు. దీంతో అక్కడ అంతా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. జ్యూస్ సెంటర్ నిర్వాహకునిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ కుమార్ జవాన్లు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed