రైతులపై వెంచర్ నిర్వాహకులు దాడి

by Sridhar Babu |
రైతులపై వెంచర్ నిర్వాహకులు దాడి
X

దిశ, అబ్దుల్లాపూర్​మెట్ : రైతులపై వెంచర్ నిర్వాహకులు దాడి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలంలో చోటుచేసుకుంది. ఓ వెంచర్ నిర్వాహకులు సంప్రదింపుల పేరుతో రైతులను, మహిళలను పిలిచి వారి మనుషులతో దాడి చేశారని రైతులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే పిగ్లిపూర్ గ్రామ సర్వేనెంబర్ 17లోని సీలింగ్ లాండ్ లో వెంచర్ నిర్మాణం చేస్తుండగా స్థానిక రైతులు అడ్డుకున్నారు. దాంతో సంప్రదింపుల పేరుతో వెంచర్ వద్దకు సంబంధిత రైతులను మంగళవారం పిలిపించారు.

అనంతరం యజమానితోపాటు నిర్వాహకులు రైతులపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గోపాల్ యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి పట్టారులపై దాడి చేశారని, ఈ ప్రాంతానికి రైతులు మళ్లీ వస్తే చంపేస్తామని బెదిరించాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ గత 6 నెలల నుండి తిరిగినా తమకి న్యాయం జరగడం లేదని వాపోయారు. బాధితులు అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Next Story

Most Viewed