రఘుపతిని ఉరి తీయాలి : గిరిజన విద్యార్థి సంఘం నాయకులు ​

by Sumithra |
రఘుపతిని ఉరి తీయాలి : గిరిజన విద్యార్థి సంఘం నాయకులు ​
X

దిశ, పరిగి : పదోతరగతి చదువుతున్న అమాయక గిరిజన విద్యార్థి పై అఘాయిత్యానికి పాల్పడిన రఘుపతిని బహిరంగంగా ఉరితీయాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్​ శ్రీనివాస్​ నాయక్​ డిమాండ్​ చేశారు. వికారాబాద్ జిల్లాలోని యాలాల మండల పరిధిలోని పెర్కంపల్లి తండాలో పదవతరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని పై అఘాయిత్యానికి పాల్పడిన సర్పంచ్ తమ్ముడు రఘుపతి సంఘటను నిరసిస్తూ పరిగిలో గిరిజన విద్యార్థి సంఘం ప్రాంతీయ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్​ శ్రీనివాస్​ నాయక్​ మాట్లాడుతూ రఘుపతిని అరెస్టు చేయడంకాదని వెంటనే ఈ కేసును పాస్ట్​ ట్రాక్ కోర్టుకు అప్పగించి ఉరి శిక్ష అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

అంతే కాకుండా విద్యార్థిని టూర్​ తీసుకువెళ్లి అనంతరం ఇంటి వద్ద వదిలేయకుండా కామాందుడికి అప్పగించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామి, క్లాస్ టీచర్ కృష్ణ కుమార్ ను అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. ఫోక్సో చట్టం, ఇతర ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా అఘాయిత్యాలు ఆగడం లేదని ఇలాంటి నిందితులను బహిరంగంగా ఉరితీస్తేనే మరొకరు ఇలా చేసేందుకు వెనకడుగు వేస్తారని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్ అన్నారు. ఈ సమావేశంలో బహుజన్ ముక్తి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్యా నాయక్, పరిగి మండల అధ్యక్షులు అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed