Disha Effect : కాలనీ వాసుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

by Kalyani |
Disha Effect : కాలనీ వాసుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
X

దిశ, కోటపల్లి:- మండల పరిధిలోని కొత్తకాలనీ ప్రజలకు నీటి ఎద్దడి ఉందని, గత మూడు రోజులుగా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దిశ పత్రికలో వచ్చిన వార్తకు స్పందన లభించింది. ఈ విషయం పై కోట్ పల్లి మండల కేంద్రం ఇంచార్జ్ పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ.. గతంలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు మంచినీటి పైప్ లైన్స్ తాత్కాలిక మరమత్తులు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పంచాయతీ ఖాతాలో డబ్బులు లేకున్నా ఎంపిడిఓ ఆదేశం మేరకు సొంత డబ్బులతో మండల కేంద్రంలోని కొత్త కాలనీ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా సమస్య పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. మంచినీటి సరఫరా శాస్వత పరిష్కారం కోసం సంబంధించిన నూతన పైప్ లైన్ వేసామని అన్నారు. మంచినీరు వచ్చేలా చర్యలు తీసుకున్న పంచాయతీ కార్యదర్శి పనితీరుపై ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed