ఎద్దు పై దాడి చేసింది పులి అని నిర్ధారణ

by Kalyani |
ఎద్దు పై దాడి చేసింది పులి అని నిర్ధారణ
X

దిశ యాలాల: పులి సంచారం చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. బుధవారం యాలాల మండలం రేళ్ళ గడ్డ తండాలో చత్ర్య నాయక్ అనే రైతు ఎద్దు పై చిరుత పులి దాడి చేయడంతో అది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మండలం లో తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు యాలాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డీఎఫ్ఓ పొలంలో ఉన్న జంతువు పాదముద్రలను పరిశీలించి, చిరుత పులికి చెందినదిగా గుర్తించారు. అటవీ శాఖఅధికారులు, యాలాల పోలీసులు మాట్లాడుతూ…. సమీప ప్రాంత ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. ప్రజలు ఎవరూ అడవి వైపు వెళ్లొద్దని, పశువులు మేకలు పొలాల దగ్గర కట్టేసి ఉంచరాదన్నారు.

Advertisement

Next Story