బీఆర్ఎస్, బీజేపీ అబద్దపు వాగ్దానాలు నమ్మొద్దు : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
బీఆర్ఎస్, బీజేపీ అబద్దపు వాగ్దానాలు నమ్మొద్దు :  రంజిత్ రెడ్డి
X

దిశ, కోటపల్లి : కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కలిసి కోటపల్లి మండల కేంద్రంలో పర్యటించారు. వీరికి కోటపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం మండల పరిధిలోని బగ్గాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని రంజిత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చెప్పే అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దు అని అన్నారు.

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా 6 గ్యారెంటీలతో ముందుకు రావడం జరిగిందన్నారు. 6గ్యారంటిలల్లో మహిళకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్య కల్పించడం పాట్ల తెలంగాణ మహిళలు సంతోషం వ్యక్తం చేశారు అని తెలిపారు. ఉచిత 200 యూనిట్ విద్యుత్, 500లకే గ్యాస్, లాంటి పథకాలు అందరికీ అందేలా చూస్తాం అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అప్పట్లో జన్ దన్ ఖాతా పేరుతో, బడ బడ వ్యాపారుల రుణాలు మాఫీ చేయడమే కాకుండా నోట్ల రద్దుతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో సంక్షోభంలో పడేసింది అని అన్నారు.

రానున్న ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని ఆయన కోరారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కి మద్దతుగా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ స్టేట్ కన్వీనర్ సునీత సంపత్, కోటపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింగ్ నాయక్, పెద్దముల్ పార్టీ అధ్యక్షులు, నాయకులు ధర సింగ్,జ్ఞానేశ్వర్, కరణంపురుష్టోత్తం,లక్ష్మరెడ్డి,నారాయణ రెడ్డి , మాజీ జడ్పీ అంజన్న, మాజీ సర్పంచ్ విజయ లక్ష్మి ,సంగయ్య, శ్రీనివాస్ తలారి, చిత్ర శేఖర్ నక్కల బంద్యాన్న,పెదేముల్, కోటపల్లి మండల నాయకులు, వివిధ విభాగాల యువ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed