అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి : స్పీకర్

by Kalyani |   ( Updated:2024-07-05 14:51:59.0  )
అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి : స్పీకర్
X

దిశ, ప్రతినిధి వికారాబాద్ : జిల్లాలో చేపడుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని స్టేట్ చాంబర్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఆస్పత్రి, వైద్య కళాశాల నిర్మాణాల పనుల పురోగతిపై సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి సభాపతి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆసుపత్రి, కళాశాలకు అవసరమైన సదుపాయాల కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా త్వరలో ప్రారంభించుకొనున్న ఆసుపత్రికి మౌలిక సదుపాయాలతో పాటు నీటి సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులపై ఆర్ అండ్ బి అధికారులను సభాపతి అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డిఓ వాసు చంద్ర, ఆర్ అండ్ బి ఇఇ లాల్ సింగ్, మిషన్ భగీరథ ఇఇ బాబు శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, ఆర్ అండ్ బి డిఈ, ఇఇ లు ఉన్నారు.

Advertisement

Next Story