- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
పార్టీ బలోపేతంపై మాజీ ఎమ్మెల్యేల సమాలోచనలు
![పార్టీ బలోపేతంపై మాజీ ఎమ్మెల్యేల సమాలోచనలు పార్టీ బలోపేతంపై మాజీ ఎమ్మెల్యేల సమాలోచనలు](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347313-89.webp)
దిశ, తలకొండపల్లి : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ నివాసంలో శనివారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలుసుకొని పార్టీ బలోపేతంపై విశ్లేషణ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు, నారాయణపేట మాజీ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి, దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహబూబ్నగర్ డిసిసి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తాలు పార్టీ మనుగడపై సమాలోచన చేసినట్లు, రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వరుసగా రెండుసార్లు పార్టీ అధికారంలోకి రావడం వల్ల ప్రజల్లో కొద్దిపాటి వ్యతిరేకత ఉండడం సహజమని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు ఇచ్చిన ఆరు నెలల్లోనే రైతులు మహిళలలో అప్పుడే వ్యతిరేకత ప్రారంభమైందని చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ము శ్రీనివాస్ యాదవ్, బుచ్చిబాబు తదితరులు ఉన్నారు.