- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
తెలుగు వెలుగు రామోజీరావు మృతి తీరని లోటు.. : చంద్రబాబు
X
దిశ, వెబ్డెస్క్: ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు (88) మృతి పట్ల టీడీపీ చీఫ్, ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు అని కీర్తించారు. రామోజీరావు మృతి తీరని లోటు అన్నారు. రామోజీరావు మృతి తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. అక్షర యోధుడు రామోజీరావు సేవలు ఎనలేనివి అని కొనియాడారు. అయితే నిన్న ఎన్డీఏ భేటీలో పాల్గొన్న చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో ఉండగా..నేడు ఆయన హుటాహుటిన హైదరాబాద్ రానున్నారు. రామోజీరావు మృతి పట్ల ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సైతం ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.
Advertisement
Next Story