వరద బాధితులకు రామోజీ గ్రూప్ భారీ విరాళం

by M.Rajitha |
వరద బాధితులకు రామోజీ గ్రూప్ భారీ విరాళం
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు రోజులుగా కురిసిన కుండపోత వర్షాలకు, భారీ వరదలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు తమవంతు సహాయాన్ని విరాళంగా ప్రకటిస్తూ తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు. రామోజీ గ్రూప్(RamojiGroups) సంస్థలు కూడా ముందుకు వచ్చి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణలోని వరద బాధితుల సహాయార్థం రూ.5 కోట్లు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి జమ చేస్తున్నట్టు ఓ ప్రకటన జారీ చేశారు. కష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed