మూడు నెలల్లో ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా రాజయ్య.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 12 |
మూడు నెలల్లో ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా రాజయ్య.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్ ఈ రోజు సాయంత్ర వరంగల్ పార్లమెంట్‌ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. మరో మూడు నెలల్లో తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతుందని.. ఆ ఉప ఎన్నికల్లో దళిత నాయకుడైన తాటికొండ రాజయ్య ఘనపూర్ ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడని జోష్యం చెప్పారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజయ్యను కాదని బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఆయన బీఆర్ఎస్ పార్టీ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో త్వరలోనే ఆయన ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం ఉందని.. కేసీఆర్ వ్యాఖ్యలను చూస్తే అర్ధమవుతుంది.



Next Story

Most Viewed