Railway News: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 60 స్పెషల్ ట్రైన్ల సేవలు పొడిగింపు

by Shiva |
Railway News: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 60 స్పెషల్ ట్రైన్ల సేవలు పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా మార్గాల్లో కొనసాగుతోన్న 60 స్పెషల్ ట్రైన్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. రానున్న విజయదశమి, దీపావళి, ఛట్‌పూజ పర్వదినాల సందర్భంగా ప్రయాణికుల రష్‌ను గమనించి స్పెషల్ ట్రైన్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

పొడిగించిన రైళ్లలో తెలుగు రాష్ట్రాల్లోని కాచిగూడ నుంచి మధురై , మధురై నుంచి కాచిగూడ, కాచిగూడ నుంచి నాగర్‌కోయిల్‌ , నాగర్‌కోయిల్‌ నుంచికాచిగూడ , సికింద్రాబాద్‌ నుంచి రామనాథపురం, రామనాథపురం నుంచి సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి కొల్లం, కొల్లంనుంచి సికింద్రాబాద్‌ డిసెంబర్‌ వరకు స్పెషల్ ట్రైన్ల రాకపోకలు కొనసాగనున్నాయి. అదేవిధంగా నర్సాపూర్‌ నుంచి సికింద్రాబాద్, మచిలీపట్నం నుంచి తిరుపతి, సికింద్రాబాద్‌ నుంచి అగర్తలా, హైదరాబాద్‌ నుంచి జైపూర్‌, హైదరాబాద్ నుంచి గోరక్‌పూర్‌, తిరుపతి నుంచి షిర్డీ సాయినగర్‌, తిరుపతి నుంచి అకోల, అకోల నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కాచిగూడ, సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌, సంత్రాగాచి నుంచి సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌, కాకినాడ టౌన్‌ నుంచి లింగంపల్లి, లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్‌, కాచిగూడ నుంచి తిరుపతి, షాలీమార్‌ నుంచి సికింద్రాబాద్‌, హజ్రత్‌ నిజాముద్దీన్‌ నుంచి సికింద్రాబాద్‌తో పాటు పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్ యథావిధిగా నడవనున్నా.

Advertisement

Next Story