Work Stress : పని ఒత్తిడితో యువ సీఏ సూసైడ్‌.. కేంద్రం విచారణ

by Hajipasha |
Work Stress : పని ఒత్తిడితో యువ సీఏ సూసైడ్‌.. కేంద్రం విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో : పనిభారాన్ని తట్టుకోలేక 26 ఏళ్ల యువ ఛార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) అన్నా సెబాస్టియన్ పెరయిల్ ఇటీవలే ఆత్మహత్య చేసుకుంది. దీనిపై అన్నా సెబాస్టియన్ తల్లి అనితా ఆగస్టైన్ సదరు కంపెనీ బాస్‌‌కు రాసిన బాధాతప్త ఈమెయిల్ వైరల్ అయింది. ఈ అంశంపై కేంద్ర కార్మిక శాఖ స్పందించింది. అన్నా సెబాస్టియన్ తల్లి నుంచి తమకు ఫిర్యాదు అందిందని వెల్లడించింది. అన్నా సెబాస్టియన్ ఎందుకు సూసైడ్ చేసుకుంది ? అసలు కారణం ఏమిటి ? అనేది తేల్చే దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు కార్మిక శాఖ తెలిపింది.

ఈమేరకు వివరాలతో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ఈ అంశంపై ఎక్స్‌లో చేసిన ఒక పోస్టుకు స్పందిస్తూ కేంద్ర మంత్రి పై ప్రకటన చేశారు. రాజీవ్ చంద్రశేఖర్ కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అన్నా సెబాస్టియన్ కూడా కేరళ వాస్తవ్యురాలే. అయితే ఆమె ఓ ప్రముఖ ఆర్థిక సేవల కంపెనీకి చెందిన పుణె బ్రాంచ్‌లో పనిచేసేది.

Advertisement

Next Story

Most Viewed