తండ్రీకూతుళ్లపై అసభ్య వ్యాఖ్యలు.. నాంపల్లి కోర్టుకు ప్రణీత్ హనుమంతు

by Rajesh |
తండ్రీకూతుళ్లపై అసభ్య వ్యాఖ్యలు.. నాంపల్లి కోర్టుకు ప్రణీత్ హనుమంతు
X

దిశ, వెబ్‌డెస్క్: తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే ప్రణీత్‌ను బెంగళూరులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బెంగళూరు నుంచి పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు పోలీసులు తీసుకొచ్చారు. ప్రణీత్‌పై 67 బీ ఐటీ, పోక్సో, 79, 294 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1 గా ప్రణీత్, ఏ2 నాగేశ్వర్ రావు, ఏ3 యువరాజ్, ఏ4 సాయి ఆదినారాయణ పేర్లను పోలీసులు చేర్చారు. అయితే గత కొన్నేళ్లుగా స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న ప్రణీత్ హనుమంతు తీరును టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ ఏపీ, తెలంగాణ సీఎంలకు సోషల్ మీడియా ద్వారా తెలిపడంతో ఈ వ్యవహారం బయట పడింది. బెంగళూరు నుంచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ప్రణీత్‌ను హైదరాబాద్ తీసుకువచ్చి నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.

Advertisement

Next Story

Most Viewed